నిజాలను నిర్భయంగా రాస్తున్న 'దిశ' : డీఎస్పీ రాఘవేంద్రరావు

by Sathputhe Rajesh |
నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ : డీఎస్పీ రాఘవేంద్రరావు
X

దిశ , మణుగూరు : నిరంతరం వార్తాసేకరణలో ముందుంటూ.. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని దిశ ప్రజలకు అందిస్తోందని మణుగూరు డీఎస్పీ ఎస్.వి.రాఘవేంద్రరావు అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో 'దిశ' క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాస్తూ అనతికాలంలోనే దిశ అందరి అభిమానాలని, మన్ననలను పొంది తనదైన శైలిలో దూసుకుపోతోందన్నారు. దిశ మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కాంక్షించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దిశ పినపాక నియోజకవర్గ ఇంచార్జ్ పొనగంటి కృష్ణ, రిపోర్టర్లు వన్నం కృష్ణ మోహన్, పిండిగ వెంకట్, యడారి ప్రసాద్, లింగా శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed