ఫీజు కట్టలేదని పాఠశాల నిర్వాకం.. విద్యార్థినిని ఏకంగా బస్సులోంచి..

by Sathputhe Rajesh |
ఫీజు కట్టలేదని పాఠశాల నిర్వాకం.. విద్యార్థినిని ఏకంగా బస్సులోంచి..
X

దిశ, సిరిసిల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫీజులే పరమావదిగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యవహారిస్తున్నాయి. నిన్న తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుభోదయ పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కందికట్ల ఉషశ్రీ ఫీజు చెల్లించలేదనే కారణంతో స్కూల్ బస్సు నుండి మార్గమధ్యలో దింపేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై డీఈఓ నామమాత్రం చర్యలు చేపట్టేలా చూసేందుకు పలువూరు ప్రైవేట్ పాఠశాలల యజమానులు రంగంలోకి దిగినట్లు సమాచారం. విద్యతో పాటు మానవీయ విలువలు నేర్పించాల్సిన ఉపాద్యాయులు, ఫీజు చెల్లించలేదని నిర్ధాక్షిణ్యంగా విద్యార్థినిని ఇలా రోడ్డు పై దింపేయడం హేయమైన చర్య అని స్థానికులు మండిపడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన శుభోదయ పాఠశాలపై కఠిన చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు.

Next Story

Most Viewed