- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి: ఎంపీ ధర్మపురి అరవింద్
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ వాతారణ వేడెక్కుతుంది. కీలక అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే నిజమాబాద్ ఎంపీ, అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిలకడ ఉండదని, వారిని గెలిపించిన పార్టీలు మారుతూనే ఉంటారని పలుమార్లు విమర్శలు చేశారు. అలాగే తనతో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారేందుకు సీఎం రేవంత్ సిద్దంగా ఉన్నాడని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు కాంగ్రెస్ నుండి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరింది.. నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చిండ్రు. రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ అరవింద్ మాటలు తీవ్ర చర్చకు దారి తీశాయి.