ప్రజాపాలన దినోత్సవానికి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

by M.Rajitha |
ప్రజాపాలన దినోత్సవానికి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
X

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 17ను 'ప్రజాపాలన దినోత్సవం'గా నిర్వహించాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే నేతల పేర్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజాపాలన దినోత్సవానికి హాజరు కావాలని పలువురు కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆహ్వానాలు పంపారు. వీరిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith sha)తోపాటు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ లకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17న 'తెలంగాణ విమోచన దినోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తోండగా.. మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి వస్తారో.. గైర్హాజరావుతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed