BREAKING: పదేళ్లుగా ఆ రెండు పార్టీలు కలిసి నడుస్తునాయ్: మంత్రి శ్రీధర్‌బాబు సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: పదేళ్లుగా ఆ రెండు పార్టీలు కలిసి నడుస్తునాయ్: మంత్రి శ్రీధర్‌బాబు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసే నడుస్తున్నాయంటూ మంత్రి శ్రీధర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హనుమకొండ జిల్లా మలడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పేరుతో వరంగల్ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.

అదేవిధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో ప్రజలను కేంద్ర మోసం చేసిందని అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని తెలిపారు. ఏది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కడియం కావ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed