Breaking News: గణేష్‌ శోభాయాత్రలో అపశృతి.. బాణాసంచా పేలి పలువురికి గాయాలు

by Maddikunta Saikiran |
Breaking News: గణేష్‌ శోభాయాత్రలో అపశృతి.. బాణాసంచా పేలి పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా గణేష్‌(Ganesh) నవరాత్రుల పూజలు పూర్తయ్యాయి.దీంతో శోభాయాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.గణేష్‌ నిమజ్జన(Ganesh Immersion) ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో రాష్ట్ర నలు మూలన సందడితో పాటు..అక్కడక్కడ అపశృతులు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి(Laxmidevipally) మండలం రెగ్గళ్ల బొడ్రాయి(Regalla Bodrayi) సెంటర్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.భక్తుల ఆటపాటలతో వినాయకుని నిమజ్జనం సందడిగా సాగుతున్న క్రమంలో శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది.పేలుడు దాటికి డ్యాన్స్ చేస్తున్న వారు ఒక్కసారిగా గాయాలతో పడి ఉన్నారు.ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మురో ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు స్థానికులు పేర్కొన్నారు.దీంతో గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా పేలుడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed