- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. భారీ భవనం నేలమట్టం

దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు, చెరువులు, కుంటలు, పార్క్ స్థలాలు, బఫర్ జోన్ల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా)కు అంకురార్పణ చేసింది. ఈ సంస్థకు చైర్మన్ స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తుండగా.. కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ను సర్కార్ నియమించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అప్పుడే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం భూములను కబ్జా చేయాలనే ఆలోచన రాకుండా చేసేందుకు ఆ సంస్థ నేరుగా యాక్షన్లోకి ఎంటరైంది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో బహుళ అంతస్థుల బిల్డింగ్ను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగానాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.