BREAKING: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌.. పట్టు వస్త్రాల సమర్పణ

by Shiva |   ( Updated:2024-07-21 05:01:20.0  )
BREAKING: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌.. పట్టు వస్త్రాల సమర్పణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు నిర్వహాకులు ఆలయాన్నా సుందరంగా అలంకరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెళ్లు, ఫలహార బండ్ల ఊరేగింపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అమ్మ వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌‌రెడ్డి అమ్మవారికి దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దేవతను దర్శించుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed