BREAKING: అడ్డంగా బుక్కైన కేఏ పాల్.. ఆ విషయంలో చీటింగ్ కేసు నమోదు

by Shiva |
BREAKING: అడ్డంగా బుక్కైన కేఏ పాల్.. ఆ విషయంలో చీటింగ్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. తాజాగా, ఆయనపై పంజాగుట్ట పీఎస్ పరిధిలో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ.50 లక్షలు తీసుకుని కేఏ పాల్ తనను మోసం చేశారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో, మిగతా రూ.20 లక్షలు పలు దఫాలుగా కేఏ పాల్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా బాధితుడు ఫిరాదులో వెల్లడించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story