పేగులతో రేవంత్ బోటి షాప్ ఏమైనా పెట్టుకుంటాడా..? సీఎంపై బూర మాస్ సెటైర్

by Disha Web Desk 19 |
పేగులతో రేవంత్ బోటి షాప్ ఏమైనా పెట్టుకుంటాడా..? సీఎంపై బూర మాస్ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేఏ పాల్ లా.. ఆర్జీ పాల్(కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) తయారయ్యారని, అర్జంట్‌గా హోంమంత్రి కావాలని ఆయన కలలు కంటున్నారని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తనపై భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తెలివైన వాడని, అన్నదమ్ముల ఇద్దరి కింద బాంబు పెట్టారని ఎద్దేవా చేశారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటానంటున్నారని, ఆ పేగులన్నీ తీసుకుని రేవంత్.. బోటి షాప్ ఏమైనా పెట్టుకుంటాడా? అంటూ బూర ఎద్దేవాచేశారు. ఆర్భాటాలు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో చూపడం లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి తెలంగాణలో రాజకీయం చేస్తూ.. జగన్‌కు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఎండిన పంటకు రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు అతీ గతీ లేదన్నారు. రైతు రుణమాఫీ ఆగష్టు 15లోపు చేస్తామంటున్నారని, ఆ రోజు రేవంత్ రెడ్డి రైతులను ఏప్రిల్ ఫూల్ చేస్తారని చురకలంటించారు.

మెజార్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు చేయడంలేదని, రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తే.. ప్రజలు జేబులో నుంచి ఎందుకు కడతారని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. ఆర్టీఏ, ఇతర లిటిగేషన్లలో రేవంత్ రెడ్డి ఫేమస్ అని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఒక ఆకు ఎక్కువ చదివారని సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు కాబట్టే ఇండ్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే లంకె బిందెలు లేవని, ఖాళీ బిందెలు ఉన్నాయని, తానేమీ చేయలేమని చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తో.. రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు.

Next Story

Most Viewed