- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
80 కోట్ల మందికి ఉచిత రేషన్.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: పదేళ్లలో ప్రధాని మోడీ దేశ రాజకీయ సంస్కృతిని పూర్తిగా మార్చేశారని.. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ దేశాన్ని విభజించు, పాలించు రీతిలోనే రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బీజేపీ చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోడీ ఆధ్వర్యంలో భారత్ ఆత్మనిర్భర్గా మారిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. మోడీ హయంలో దేశంలో పేదరికం తగ్గిందని.. దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నామని తెలిపారు.
పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక సహయం చేస్తున్నామని చెప్పారు. కరోనా క్లిష్ట సమయాన్ని మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. ఆటో మొబైల్ రంగంలోనూ భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, పేదళ్ల క్రితం మన ఫోన్లపై మేడిన్ చైనా, మేడిన్ కొరియా అని ఉండేదని.. ఇప్పుడు మాత్రం మనం వాడుతోన్న ఫోన్లపై మాత్రం మేడిన్ ఇండియా అని ఉంటోందన్నారు. మోడీ నేతృత్వంలో వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.