- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
దిశ, ఎల్లారెడ్డి: ఎన్నికల వేళ జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సుభాష్ రెడ్డికి ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో వడ్డేపల్లి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశాడని.. ఇప్పుడు కూడా ఆయన సేవలు పార్టీకి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్ ఆశించి వడ్డేపల్లి భంగపడ్డారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి దాదాపు 27000 ఓట్లు సాధించారు. గత కొంత కాలంగా అనుచరుల ఒత్తిడితో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. చివరకు ఇవాళ కాంగ్రెస్లో చేరారు.