BIG BREAKING: డీఎస్సీ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పరీక్షల షెడ్యూల్ విడుదల

by Shiva |
BIG BREAKING: డీఎస్సీ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా జూలై 18న మొదటి షిఫ్ట్‌లో స్యూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు. అదేవిధంగా జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష, జూలై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యూకేషన్ పరీక్షలను జరగనున్నాయి. జూలై 22న స్యూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష, జూలై 24న స్కూల్ అసిస్టెంట్, బయోలాజికల్ సైన్స్ పరీక్ష, జూలై 26న తెలుగు భాషా పండట్ సెంకండరీ గ్రేడ్ పరీక్ష, జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి 28న పాఠశా విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందుకు దరఖాస్తు గడువు ఈనెల 20తో ముగిసింది. ఇప్పటి వరకు మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందినట్లుగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది.



Next Story