గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డిని అడుగుతున్నా?.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

by Disha Web Desk 5 |
గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డిని అడుగుతున్నా?.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఇది ప్రజా ప్రభుత్వమా?.. దగా ప్రభుత్వమా? అని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేశానని రేవంత్ రెడ్డి చెప్పడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇచ్చేశామని గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా..

  • తెల్లరేషన్ కార్డుల జాడ లేదు.
  • రూ.15వేల భరోసా లేదు.
  • రూ.4వేల నిరుద్యోగ భృతి లేదు
  • మహిళలకు రూ.2వేల సహాయం లేదు.

కానీ 6 గ్యారంటీల్లో 5 అయిపోయాయంటున్నావ్ అని.. అసలు ఇది ప్రజాప్రభుత్వమా?.. దగా ప్రభుత్వమా? అని కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా ప్రశ్నించారు.

Read More...

BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

Next Story