ఆరవ రోజు ఆరు నామినేషన్‌లు

by Disha Web Desk 23 |
ఆరవ రోజు  ఆరు నామినేషన్‌లు
X

దిశ,ఆదిలాబాద్ : లోక్ సభ ఎన్నికల నామినేషన్ల లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఆరవ రోజు ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఇందులో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు మాజీ మంత్రి జోగు రామన్న,ఆపార్టీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి,అనిల్ జాదవ్ ,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ల కలిసి తన నామినేషన్ ను దాఖలు చేశారు. అంతే కాకుండా బీఆర్ యస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున రెండవ నామినేషన్ పత్రమును ఎమ్మెల్సీ దండే విఠల్ , బీఆర్ ఎస్ నాయకులు జాన్సన్ నాయక్, లోలం శ్యాంసుందర్, రామ్ కిషన్ రెడ్డి, మర్శకోల సరస్వతిలతో రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఇంకా ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి గేడం సాగర్. జిల్లా కేంద్రంలోని రణదివే నగర్ కు చెందిన స్వతంత్ర అభ్యర్థి గా. మేస్రం గంగాదేవి రెండో సెట్ వేయగా,ఉట్నూర్ కు చెందిన చవాన్ రాము స్వతంత్ర అభ్యర్థి గా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.



Next Story

Most Viewed