పోలింగ్ కేంద్రాల సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
పోలింగ్ కేంద్రాల సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి : జిల్లా కలెక్టర్
X

దిశ, ఆసిఫాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సౌకర్యాల పై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తహసీల్దార్ ను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణులతో కలిసి తహసిల్దార్లు, ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం తో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసం రాంపులు ఏర్పాటు చేయాలని, ఓటరు జాబితా పై పోలింగ్ కేంద్రాల వివరాలు, చిరునామా, తప్పులుంటే సరి చూసుకోవాలని సూచించారు. సెక్టార్, సూపర్వైజర్, బూత్ స్థాయి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని తెలిపారు.అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించారు.వేసవి నేపథ్యంలో కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం నీటి వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed