శ్రీరామ నవమి ఎఫెక్ట్.. మరో కేసులో ఇరుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్

by Disha Web Desk 19 |
శ్రీరామ నవమి ఎఫెక్ట్.. మరో కేసులో ఇరుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆఫ్జల్‌గంజ్ పోలీసులు రాజా సింగ్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గౌలిగూడ వద్ద ర్యాలీ ఆపి బాణాసంచా కాల్చడంతో పాటు భక్తులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కేసు నమోదు చేశారు.

కాగా, ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున రామ భక్తులు, బీజేపీ కార్యకర్తలు, రాజా సింగ్ అభిమానులు హాజరయ్యారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందుగానే రాజాసింగ్ శోభాయాత్రకు అనుమతి నిరాకరించారు. పర్మిషన్ ఇవ్వనప్పటికీ రాజా సింగ్ ర్యాలీ తీయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed