వారికి మాత్రం X ప్రీమియం, ప్రీమియం+ ఉచితం.. మస్క్ సంచలన ప్రకటన

by Disha Web Desk 17 |
వారికి మాత్రం X ప్రీమియం, ప్రీమియం+ ఉచితం.. మస్క్ సంచలన ప్రకటన
X

దిశ, టెక్నాలజీ: ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా X ప్రీమియం, X ప్రీమియం+ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో 2,500 కంటే ఎక్కువ వెరిఫైడ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందించనున్నారు. అలాగే, 5 వేల మందికి పైగా ఫాలోవర్స్‌‌ను కలిగి ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం+ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత్‌లో ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ. 650, వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 6,800గా ఉంది. అదే ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.1,300, వార్షికంగా అయితే ధర రూ.13,600గా ఉంది. అయితే కొత్త పాలసీ ప్రకారం ఎక్కువ మంది వెరిఫైడ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నట్లయితే ఈ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.


Next Story

Most Viewed