జూలై 5 వరకు పది పరీక్షలు లేనట్టే

by Shyam |   ( Updated:2020-06-07 10:51:37.0  )
జూలై 5 వరకు పది పరీక్షలు లేనట్టే
X

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షలను వచ్చే నెల 5వరకూ పరీక్షలు నిర్వహించడం లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదివారం ప్రకటించింది. కోర్టు సూచనల ప్రకారం పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 8 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలను జూలై 5వరకు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ.సత్యనారాయణ రెడ్డి ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సిద్ధం చేసిన థర్మల్ కిట్లను, పరీక్ష పత్రాలు, ఇతర మెటీరియల్స్‌ను భద్రపరచాలని జిల్లాల విద్యాధికారులకు ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed