- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Varanasi Cricket Stadium: మోదీకి సచిన్, జై షా గిఫ్ట్స్.. ఏమిచ్చారో తెలుసా?
దిశ, వెబ్డెస్క్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. నూతన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.. మోదీకి భారత్ జెర్సీని అందజేశారు. ఒకటో నెంబర్తో ఉన్న ఈ జెర్సీ వెనకాల 'నమో' అని రాసి ఉంది. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.. ప్రధానికి బ్యాట్ జ్ఞాపికను అందజేశారు.
#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023