IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్.. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం

by Vinod kumar |   ( Updated:2023-09-11 16:36:45.0  )
IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్.. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ సూపర్-లో భాగంగా భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత భారీ వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. వర్షం వల్ల మ్యాచ్‌ నిలిచిపోయేసరికి భారత్ స్కోరు 147/2. రోహిత్ శర్మ (56), గిల్ (58) పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) పరుగులతో ఉన్నారు. మ్యాచ్‌కు రేపు రిజర్వ్‌ డే ఉన్న సంగతి తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) అర్ధ సెంచరీలు బాది జట్టుకు శుభారంభం అందించారు. కానీ, వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔటయ్యారు.

Advertisement

Next Story

Most Viewed