టీమిండియాతో పోరుకు జింబాబ్వే జట్టు ఖరారు

by Harish |
టీమిండియాతో పోరుకు జింబాబ్వే జట్టు ఖరారు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 6న తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టును ప్రకటించింది. సోమవారం జింబాబ్వే క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన తమ జట్టును ఖరారు చేసింది. సికందర్ రజా కెప్టెన్సీలో యువకులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో రజా, ల్యూక్ జోంగ్వే, పేసర్లు రిచార్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్లు. టెండై చతారా, డియెన్ మైయర్స్, ఇన్నోసెంట్ కైయా, మిల్టాన్ షుంభాతోపాటు డ్రగ్స్ వినియోగం కారణంగా నాలుగు నెలల నిషేధానికి గురైన వెస్లీ మాధేవెరే, బ్రాండన్ మావుటా తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే, బెల్జియంలో జన్మించిన అంటుమ్ నఖ్వీకి కూడా చోటు దక్కింది. అయితే, సిటిజన్‌షిప్ స్టేటస్‌కు లోబటి అతని తుది చేరిక ఉంటుందిన జింబాబ్వే క్రికెట్ పేర్కొంది.

జింబాబ్వే జట్టు : సికందర్ రజా(కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, జోనాథన్, చతారా టైండై, లూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, మదాండే క్లైవ్, వెస్లీ మాధేవెరే, తడివానాషే, వెల్లింగ్టన్, బ్రాండన్ మవుటా, ముజారబానీ, డియెన్ మైయర్స్, మిల్టాన్ షుంభా, అంటుమ్ నఖ్వీ, రిచార్డ్ నగరవ.

Next Story