- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన

దిశ, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి బీసీసీఐ(BCCI) భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన టీమ్ను శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కూ ఇదే జట్టు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో భారత్-పాకిస్తాన్(India-Pakistan) మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్లు ఆడనుంది.
ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాక్తో, మార్చి 2న న్యూజిలాండ్తో టీమ్ఇండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. దాయాది దేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమ్ఇండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది. మ్యాచ్ల నిర్వహణ మొత్తం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించానున్నారు.
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, జస్ప్త్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.