సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ

by srinivas |
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చాయని, దానిపై స్పందించాలని జగన్‌ను కోరారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం శాశ్వతంగా మూతపడేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తే.. ప్రైవేట్ పాఠశాలలు నిలబడతాయని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రైవేట్ విద్యాసంస్థలు కుప్పకూలుతాయని తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed