- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్బ్యూరో: డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు కార్గో బస్సులో ఉన్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 250కిలోల ఎపిడ్రిన్, కెటమైన్, మేపిడ్రిన్ను సీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో మత్తు మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు… డ్రగ్స్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మరో రూ.50కోట్ల విలువ చేసే రా మెటిరియల్ను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం నగరంలో దాడులు నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు 110కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశాఖలో రూ.70వేలకు 100 కిలోల గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి వేచి చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆశిష్సింగ్, సుమిత్ మకాడియా, రామావత్ మోతిలాల్, రామావత్, విజయ్, రాజ్ కుమార్ సింగ్లను అదుపులోకి తీసుకొని షిప్ట్ కారు, 7సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.