చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

by Indraja |
చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: నర్శీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి సన్మాన సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతక ముందులా మాట్లాడేందుకు నాకు అవకాశం లేదు. అధ్యక్షా అంటే ఏవమ్మా అని అనడమే. నాకు ఇచ్చింది రాజ్యాంగబద్దమైనటువంటి కుర్చీ, ఆ కుర్చిలో కూర్చునే అవకాశం ఎవరికో తప్ప అందరికీ రాదు. నా నోటికి ప్లాస్టర్ వేసి చంద్రబాబు నాయుడు నన్ను ఆ కుర్చీలో కూర్చోపెట్టారు.

చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత. ఆ బాధ్యతను భుజాన వేసకుని నేను పని చేస్తాను. ఇప్పటికే నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కనీసం ఇప్పుడైనా కాపాడుకుందాం. ఇంటికి వచ్చి గోడలు దూకి, మెడమీద చెయ్యి వేసి నన్ను పోలీసే వ్యాన్ ఎక్కించారు. ఏ పోలీసులైతే గోడలు దూకి నన్ను అరెస్ట్ చేశారో ఆ పోలీసులే ఇప్పుడు నాకు సెల్యూట్ కొడుతున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అదే. నాకు నేతల ఆశ్విర్వాదంతోపాటు ప్రజల ఆశిర్వాదం ఉంది కనుక నన్ను ఎవరూ ఏం చేయలేరు.’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed