బీఆర్ఎస్ ను​ అడ్డుకుంటాం .. మానిక్​రావు థాక్రే

by Javid Pasha |
బీఆర్ఎస్ ను​ అడ్డుకుంటాం .. మానిక్​రావు థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో బీజేపీని అడ్డుకున్నట్లే..తెలంగాణలోనూ బీఆర్ఎస్​పార్టీకి చెక్​పెడతామని కాంగ్రెస్​ ఇన్​ఛార్జీ మానిక్​ రావు థాక్రే పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్​పార్టీ ని అడ్డుకుంటామన్నారు. ఒక్క సీటు కూడా గెలవనీయమని ధీమాను వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​దే గెలుపు అన్నారు. ప్రత్యేక వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామన్నారు. గాంధీభవన్​లో యూత్ కాంగ్రెస్​పోస్టర్లు ఆవిష్కరించిన ఆయన.. జులై 11,12,13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ జరగబోతుందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, వాటి నియంత్రణకు యూత్ ప్లీనరీలో ప్రత్యేక ప్రణాళికను తీసుకుంటామన్నారు.

యూత్ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన వాళ్లకే.. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఇంచార్జిలను నియమించబోతున్నామన్నారు. ఇప్పటికే 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్​ఛార్జీలను ఫైనలైజ్ చేశామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు టిక్కెట్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు పాల్గొన్నారు.



Next Story