నూతన్ నాయుడిపై మరో కేసు నమోదు

by  |
నూతన్ నాయుడిపై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో యువకుడికి శిరోముండంనం చేసిన కేసులో ఇప్పటికే అరెస్టైన నూతన్ నాయుడిపై మరో కేసు నమోదు అయ్యింది. ప్రముఖ వ్యక్తి పేరుతో ఫోన్ చేసి వైద్య పరీక్షల రిపోర్టును మేనేజ్ చేసేందుకు యత్నించాడని సుజాత అనే మహిళ డాక్టర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. శిరోముండనం కేసుతో నూతన నాయుడు, ఆయన భార్య ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఇదే క్రమంలో నూతన్ నాయుడు చేసిన మోసాలు, వ్యవహారాల వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Next Story

Most Viewed