ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు..!

by  |
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు..!
X

దిశ, పటాన్‌చెరు: మెదక్ జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‎పర్సన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకట మణికరణ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని అన్నారు. గత ఏడేళ్లలో అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed