వైరస్ కన్నా భయమే పెద్ద సమస్య: సీజేఐ

by Shamantha N |
వైరస్ కన్నా భయమే పెద్ద సమస్య: సీజేఐ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పట్ల ఆందోళన, భయమే.. వైరస్ కన్నా పెద్ద సమస్య అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. 21 రోజుల లాక్ డౌన్ దాటికి సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వేలాది మంది వలస కార్మికులకు ప్రభుత్వం సాయం చేయాలని దాఖలైన 2 పిటిషన్లను సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రభుత్వం చేయపూనుకున్న పనుల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఈ పిటిషన్ విచారణకు ముందు ప్రభుత్వం…. స్టేటస్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించాలని అభిప్రాయపడ్డారు.

Tags : Coronavirus, fear, panic, problem, cji, supreme court

Next Story