ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్..!

by Shamantha N |
ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్..!
X

దిశ వెబ్‎డెస్క్: నవోదయ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 454 మంది ఉపాధ్యాయుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) నోటిఫికేషన్ జారీ చేసింది. గోవా, గుజరాత్‌, మహారాష్ర్ట, డామన్‌ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలో ఖాళీల్లో ఈ భర్తీ జరగనుంది. మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, 98 పీజీటీ, 283 టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11 వ తేదీ లోగా దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story