దీపిక, రకుల్‌కు ఎన్‌సీబీ సమన్లు

by  |
దీపిక, రకుల్‌కు ఎన్‌సీబీ సమన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. ఇప్పటికే డ్రగ్ మాఫియా కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ కాగా.. లేటెస్ట్‌గా హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసింది. దీపిక ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని.. శ్రద్ధ, సారా, రకుల్‌ను 26న విచారణకు అటెండ్ కావాలని కోరింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా.. విచారణ ప్రారంభించిన ఎన్‌సీబీకి బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం గురించి తెలిసింది. ఇప్పటికే దీపిక మేనేజర్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేయడంతో పాటు సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాను ప్రశ్నించింది. ఈ క్రమంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed