Vasundhara Raje: రాజస్థాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం గెహ్లాట్‌‌తో బీజేపీ సీనియర్ నేత భేటీ

by Vinod kumar |
Vasundhara Raje: రాజస్థాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం గెహ్లాట్‌‌తో బీజేపీ సీనియర్ నేత భేటీ
X

జైపూర్‌ : రాజస్థాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్‌‌తో బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే భేటీ అయ్యారు. జైపూర్‌లో కొత్తగా నిర్మించిన రాజస్థాన్ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వసుంధర రాజే, సీఎం అశోక్‌ గెహ్లాట్‌తో కలిసి సమావేశ వేదికను పంచుకోలేదు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అశోక్‌ గెహ్లాట్‌‌తో ప్రత్యేకంగా ఆమె భేటీ అయ్యారు. దీంతో రాజస్థాన్‌ రాజకీయాల్లో కలకలం రేగింది.

బీజేపీ తనను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న వసుంధర రాజే.. సీఎం గెహ్లాట్‌తో భేటీ కావడంతో ఏదో సంచలనం జరగబోతోందనే ప్రచారం స్థానిక మీడియాలో నడిచింది. శుక్రవారం రోజు ఉదయం తన సొంత నియోజవర్గంలో జరిగిన బీజేపీ పరివర్తన్ యాత్రకు గైర్హాజరైన వసుంధర రాజే.. అదే రోజు గెహ్లాట్‌తో భేటీ కావడం గమనార్హం. దీనిపై వసుంధర రాజే కార్యాలయం స్పందించింది. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సీపీ జోషి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ కూడా వారితోపాటు ఉన్న పూర్తి ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Advertisement

Next Story

Most Viewed