BREAKING: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఒకరు మృతి.. 400 మందికి గాయాలు

by Satheesh |   ( Updated:2024-07-07 16:09:50.0  )
BREAKING: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఒకరు మృతి.. 400 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. పూరీ జగన్నాథుడు ఆశీనులైన రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 400 మంది భక్తులు గాయపడ్డట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ బృందాలు సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో ఓ మతపర కార్యక్రమంలో తొక్కి సలాట జరిగి 121 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఓ పక్కా ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే తాజాగా పూరీ రథయాత్రలో తొక్కిసలాట జరిగి 400 మంది గాయపడటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed