'మర్డర్ చేసింది మేమే'.. గ్యాంగ్‌స్టర్‌ సుఖా దునెకే మర్డర్‌పై క్లారిటీ

by Vinod kumar |
మర్డర్ చేసింది మేమే.. గ్యాంగ్‌స్టర్‌ సుఖా దునెకే మర్డర్‌పై క్లారిటీ
X

ఒట్టావా (కెనడా) : కెనడాలో బుధవారం జరిగిన ఖలిస్థానీ సానుభూతిపరుడు గ్యాంగ్‌స్టర్‌ సుఖా దునెకే మర్డర్‌పై క్లారిటీ వచ్చింది. అతడి హత్య తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఫేస్ బుక్ వేదికగా ప్రకటించింది. గ్యాంగ్‌స్టర్లు గుర్లార్‌ బ్రార్‌, విక్కీ మిదిఖేరాల హత్యలో సుఖా దునెకే ప్రధాన పాత్ర పోషించాడని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆరోపించింది. అతడు మత్తుపదార్థాలకు బానిసని, ఎంతో మంది యువకులు, ప్రజల జీవితాలను నాశనం చేశాడని.. చివరకు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాడని పేర్కొంది. దవీందర్ బంబిహా ముఠాకు చెందిన సుఖ్‌దూల్ సింగ్, గ్యాంగ్‌స్టర్ సందీప్ నంగల్ అంబియాను కూడా సుఖా దునెకే చంపేశాడని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తెలిపింది. కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌ డ్రగ్స్‌ రవాణా కేసులో అరెస్టు కాగా.. ప్రస్తుతం అహ్మదాబాద్‌ జైలులో ఉన్నాడు.

Advertisement

Next Story