17 వేల ప్రభుత్వ పోస్టుల దరఖాస్తు తేదీ పొడిగింపు

by Mahesh |
17 వేల ప్రభుత్వ పోస్టుల దరఖాస్తు తేదీ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సీజీఎల్ఈ -2024 దరఖాస్తులను స్టాఫ్ సెలక్టన్ కమిషన్(SSC) పొడిగించింది. 17,727 పోస్టులకు ఈ నెల 24 తో గుడువు ముగియగా.. దీనిని ఈ నెల 27 రాత్రి 11 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపునకు జూలై 28 వరకు అవకాశం ఇచ్చింది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ ఫామ్ ను ఎడిట్ చేసుకోవడానికి ఆగస్టు 10, 11 తేదీల్లో అవకాశం కల్పించింది. మొత్తం 17,727 ప్రభుత్వ పోస్టులకు డిగ్రీ పాసైన 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్స్ సెంటర్స్ ప్రతి రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.



Next Story