Kangana Ranaut: రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. కంగనా తీవ్ర వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Kangana Ranaut: రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. కంగనా తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెబీ చైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నది. ఈ క్రమంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ప్రధాన మంత్రి కాకపోతే ఈ దేశాన్ని విఛ్ఛిన్నం చేయడమే ఆయన ఎజెండా అని ఆరోపించారు. ఎక్స్ ట్విట్టర్ లో సోమవారం ఓ పోస్ట్ చేసిన ఆమె.. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆధారంగా స్టార్ మార్కెట్ గురించి రాహుల్ గాంధీ అసంతృప్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం యొక్క భద్రత, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ.. మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చొడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ తమ నాయకుడిగా ఎంచుకోరు అని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed