జై శ్రీరాం కాదు, అల్లా హో అక్బర్ మాత్రమే.. ముగ్గురు వ్యక్తులపై దాడి (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
జై శ్రీరాం కాదు, అల్లా హో అక్బర్ మాత్రమే.. ముగ్గురు వ్యక్తులపై దాడి (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: జై శ్రీరాం కాదు, అల్లా హు అక్బర్ మాత్రమే అనాలంటూ ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం శ్రీరామ నవమి సందర్భంగా బెంగళూరులోని చిక్కబెట్టహళ్లి ప్రాంతంలో ఓ ముగ్గురు వ్యక్తులు మతపరమైన జెండాను పట్టుకొని కారులో ప్రయాణిస్తూ.. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బైక్ పై ఓ ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించి కారును అడ్డగించారు. ఎందుకు అడ్డగించారని ప్రశ్నించగా.. జై శ్రీరాం కాదు. అల్లా హు అక్బర్ అని నినాదాలు చేయాలని వారిని డిమాండ్ చేశారు.

అందులో ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించి కారులోని వారిని కిందికి దింపి వారి జెండాను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాధం మొదలై ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో కారులో నుంచి దిగిన వ్యక్తి తలకు గాయం కాగా.. మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయలయ్యాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న విద్యారణ్యపుర పోలీసులు బైక్ పై వచ్చి దాడి చేసిన వ్యక్తులు ఫర్హాన్, సమీర్ గా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు సిటీ నార్త్ జోన్ డీసీపీ తెలిపారు.

Next Story

Most Viewed