కాంగ్రెస్ నేతను మెచ్చుకున్న గడ్కరీ..

by Vinod kumar |
Nitin Gadkari Says He Often Feels Like Quitting from Politics
X

పుణె : కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొనియాడటాన్ని మొన్న మనం చూశాం.. తాజాగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను గడ్కరీ మెచ్చుకున్నారు. మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌ ఆలయ దర్శనానికి పాదయాత్రగా దిగ్విజయ్ వచ్చారు. విఠల స్వామి, రుక్మిణి మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పుణె సమీపంలోని పింప్రి చించ్‌వాడ్‌లో దివంగత కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణ మోరే పై పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమానికి గడ్కరీ, దిగ్విజయ్ హాజరయ్యారు.

ఏటా తీర్థయాత్ర కోసం మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌కు దిగ్విజయ్ పాదయాత్ర చేస్తూ రావడాన్ని గడ్కరీ ప్రశంసించారు. "నేను మీ కంటే వయసులో చిన్నవాడినే.. అయినప్పటికీ (నడవడానికి) మీలాంటి ధైర్యం నాకు లేదు.. మీరు (తీర్థయాత్రలో) చాలా నడుస్తారు.. మీకు నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు" అని దిగ్విజయ్ ను గడ్కరీ కొనియాడారు. "మహారాష్ట్ర రాజకీయ సంస్కృతి గొప్పది. మాకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. కానీ వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి ద్వేషభావం లేదు" అని పేర్కొన్నారు.

Advertisement

Next Story