మేఘాలయాలో స్వల్ప భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు

by vinod kumar |
మేఘాలయాలో స్వల్ప భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో 2.23 గంటలకు ప్రకంపనలు రాగా..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. వెస్ట్ ఖాసీ హిల్స్‌ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్క సారిగా నిద్రలేచిన పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప ప్రకంపనలే కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. అంతకుముందు మే 14న పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 25కీలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించారు. కాగా, గతేడాది డిసెంబర్‌లోనూ తైవాన్ తో పాటు మేఘాలయాలో భూకంపం వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed