జోడో యాత్రలో రాహుల్ గాందీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి బీజేపీలో చేరిక

by Disha Web Desk 12 |
జోడో యాత్రలో రాహుల్ గాందీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి బీజేపీలో చేరిక
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ రెండో దశ పోలింగ్ వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు డాక్టర్ శుశ్రుత గౌడ అనే కీలక నేత రాహుల్ గాందీతో కలిసి నడిచాడు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఈ రోజు ఆయన రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చి.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. "ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం, నా కలను సాకారం చేసుకోవడానికి బీజేపీ ఉత్తమమైన పార్టీ అని నేను భావించాను" అలాగే దేశ అభివృద్ధిలో నా వంతు పాలుపంచుకోవడం కోసం బీజేపీలో చేరుతున్నానని అన్నారు.



Next Story

Most Viewed