- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘ఇండియా’కు విజన్ లేదు.. లీడర్ లేడు : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ఆ కూటమికి విజన్ లేదు.. లీడర్ లేడు అని ఆయన విమర్శించారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘ఇండియా కూటమికి నవ భారత నిర్మాణంపై విజన్ లేదు. వాళ్ల చరిత్ర అంతా కుంభకోణాలమయం. అందుకే దేశ ప్రజలంతా అబ్కీ బార్ మోడీ సర్కార్ కోరుకుంటున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వం కష్టపడి పని చేసింది. నా జీవితంలో ప్రతి సెకను ప్రజల సంక్షేమానికి అంకితం చేశాను’’ అని ప్రధాని మోడీ తెలిపారు. ‘‘శుక్రవారం జరిగిన తొలి విడత ఓటింగ్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా జరిగింది. ఆ పోలింగ్ ప్రక్రియ దేశంలో ఉత్కంఠను పెంచింది’’ అని చెప్పారు. ఈ సభ వేదికగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడతో ప్రధాని మోడీ కలిసి చేతులు పైకి లేపి ప్రజలకు అభివాదం చేశారు. చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎంఆర్ సీతారాం కుమారుడు ఎంఎస్ రక్షా రామయ్య బరిలోకి దిగారు. కర్ణాటక లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి.