- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇది విని నేను షాక్కు గురయ్యా!
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ ఇది విని నేను షాక్కు గురయ్యానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దూరదర్శన్ లోగోకు ఉన్న రంగు కాషాయ రంగులోకి మారడంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు మన దూరదర్శన్ లోగో రంగు మారడం చూసి షాక్ అయ్యానని, ఇది పూర్తిగా అనైతికం, చట్ట విరుద్దం కూడా అన్నారు. అలాగే ఈ జాతీయ ప్రజల మీడియా బీజేపీకి అనుకూలంగా గట్టిగా మాట్లాడుతుంది! అని తెలిపారు.
ప్రజలందరూ ఎన్నికల మూడ్ లో ఉన్న ఈ సమయంలో.. ఇటువంటి ఘోర ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను భారత ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. అంతేగాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఆపాలి. లేదా దూరదర్శన్ యొక్క అసలు రంగు అయిన నీలం రంగులోనికి దానిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ అయినటువంటి దూరదర్శన్ తన లోగోను ఎరుపు రంగు నుంచి కాషాయం రంగులోకి మార్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ ఇలా చేయడం పట్ల విపక్షాల నుండి విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.