ప్రధాని మోడీని డేంజరస్ నియంతతో పోల్చిన మాజీ సీఎం

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీని డేంజరస్ నియంతతో పోల్చిన మాజీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలకు ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటిషియన్స్ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఉత్తర కొరియా డేంజరస్ నియంత కిమ్ జోంగ్ ఉన్ పోల్చారు. ఇండియాలో మరో కిమ్ తయారు అవుతున్నాడని ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు.

నియంత కిమ్‌ను అనుకరిస్తూ దేశ ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌లో తయారవుతున్న కిమ్ (మోదీ)ని చూసి ఆందోళనకు గురవుతున్నానని శరద్ పవార్ అన్నారు. దేశంలో నియంత పాలన చేస్తోన్న ఎన్డీఏ కూటమిని లోక్ సభ ఎన్నికల్లో ఓడించాని పిలుపునిచ్చారు. భారత్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని అన్నారు. శక్తివంతమైన ఓటు హక్కు ద్వారా బీజేపీ కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed