- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బెదిరింపులు

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఆరు పాఠశాలలకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ విహార్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు స్కూళ్లకు శుక్రవారం తెల్లవారుజామున బెదిరింపు (Bomb Threats to Schools) ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన విద్యాసంస్థల యాజమాన్యం వెంటనే ఢిల్లీ (Delhi) పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థులను ఇంటికి పంపించివేసింది. ఇక, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్ తో అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ బెదిరింపులు
అయితే, ఢిల్లీలోని పాఠశాలలకు (Delhi Schools) బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. డిసెంబరు 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించారు. అయితే, అది ఫేక్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇకపోతే, ఈ ఏడాది ప్రారంభం నుంచే ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే, రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.