- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఎల్కే అద్వానీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిక!
by vinod kumar |
![ఎల్కే అద్వానీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిక! ఎల్కే అద్వానీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరిక!](https://www.dishadaily.com/h-upload/2024/07/03/348655-lk-adhvaani.webp)
X
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 9గంటలకు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అద్వానీ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గత నెల 26న కడా అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉండటంతో డాక్టర్లు చిన్న పాటి సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి అస్వస్థతకు గురికావడం గమనార్హం.
Next Story