మణిపూర్‌ సీఎం కాన్వాయ్‌పై దాడి..ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు

by vinod kumar |
మణిపూర్‌ సీఎం కాన్వాయ్‌పై దాడి..ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ కాన్వాయ్ పైనే దాడి చేశారు. అయితే కాన్వాయ్‌లో సీఎం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సోమవారం సందర్శించేందుకు సీఎం బిరేన్ సింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే సీఎం పర్యటనకు ముందు భద్రతా పరిస్థితుల దృష్యా ఓ బృందాన్ని మొదట పంపించారు. ఇంఫాల్ నుంచి జిరిబామ్ వెళ్లే దారిలోనే కాంగ్‌పోక్పి జిల్లాలో ఆ వాహనాలపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహనాలపై పలుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జాతీయ రహదారి-53లోని కోట్లెన్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం జిరిబామ్‌లో రెండు పోలీసు అవుట్‌పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ కార్యాలయం, సుమారు 70 ఇళ్లను మిలిటెంట్లు తగుల బెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కాన్వాయ్ పై దాడి జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed