Breaking:రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు

by Jakkula Mamatha |
Breaking:రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు
X

దిశ,వెబ్‌డెస్క్: అస్సాంలోని డిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(12520) పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు(గురువారం) సాయంత్రం 4 గంటలకు డిమా హసావో జిల్లాలోని దిబ్లాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్, నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ రైలు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పవర్ కార్, ఇంజిన్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే.. సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్-బాదర్‌పూర్ సింగిల్-లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story