ముంబై-నాగపూర్ హైవేపై కారు బీభత్సం.. ఏడుగురు మృతి

by Shamantha N |
ముంబై-నాగపూర్ హైవేపై కారు బీభత్సం.. ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైకి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో జల్నా జిల్లాలో ముంబై-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పై ప్రమాదం జరిగింది. కడ్వాంచి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కారు డ్రైవర్‌ పెట్రోల్‌ ఫిల్‌ చేసుకున్న తర్వాత రాంగ్ రూట్ లో హైవేపై వచ్చాడు. రాంగ్ రూట్ నుంచి కారుని క్రాస్ చేసే టైంలో ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొన్నాడు. దీంతో, ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న బారికేడ్లపై పడిపోయింది. కారులో ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.



Next Story