రోడ్డు ప్రమాదానికి గురైన స్టార్ నటి.. రెండు ఎముకలు విరిగాయంటూ పోస్ట్

by Disha Web Desk 7 |
రోడ్డు ప్రమాదానికి గురైన స్టార్ నటి.. రెండు ఎముకలు విరిగాయంటూ పోస్ట్
X

దిశ, సినిమా: పాపులర్ టెలివిజన్ యాక్టర్ దివ్యాంకా త్రిపాఠికి రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఆమెకు ఈ ప్రమాదం జరిగ్గా.. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా ఆమె భర్త తెలుపుతూ.. ‘యాక్సిడెంట్ జరిగిన విషయం తెలియగానే హూటాహూటిన ఆసుపత్రికి వెళ్లాను. ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ ప్రమాదంలో దివ్యాంకకు రెండు ఎముకలు విరిగాయని.. శాస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రెటీలు దివ్యాంక తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. అయితే.. ‘యే హై మొహబ్బతీన్’ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తర్వాత ఎన్నో సీరియల్స్‌తో పాటు.. రియాలిటీ షోలలో కూడా పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది. కాగా.. దివ్యాంకకు విరిగిన ఎముకులకు సంబంధించిన ఎక్స్‌రేలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed